మహారాష్ట్రలో కాంగ్రెస్ను వీడనున్న 15 మంది ఎమ్మెల్యేలు
మహారాష్ట్రలో కాంగ్రెస్ను వీడనున్న 15 మంది ఎమ్మెల్యేలు
-షిండే, అజిత్ వర్గాల్లో చేరికకు ఏర్పాట్లు
ముంబై: ఇటీవల మాజీ మంత్రి మిలింద్ దేవ్రా కాంగ్రెస్ను వీడి శివసేన(షిండే వర్గం)లో చేరారు.
అదే బాటలో మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు త్వరలో పార్టీని వీడనున్నారు. ముంబైలో కీలకమైన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్లు ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)లోకి వస్తారనే చర్చ సాగుతున్నది. అయితే వీరే కాకుండా ఇంకా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని ఆ పార్టీ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఓ ఇంగ్లిష్ వెబ్సైట్ ప్రచురించిన ఈ వార్త రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉతంఠ రేపుతున్నది.
అజిత్ పవార్ వర్గంలోకి ముస్లిం ఎమ్మెల్యేలతో సహా ఇతర కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడం ద్వారా ముంబైలో మహా కూటమి బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. బీజేపీ చేర్చుకోవాలనుకొంటున్న వారిలో ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలూ ఉన్నారు. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర ముంబైకి చేరుకోకముందే వీరంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా బీజేపీ సెచ్ వేసిందని కాంగ్రెస్ కీలక నేత తెలిపారు.