Top Ad unit 728 × 90

మరో రెండు టెస్టులకు కోహ్లీ దూరం!

మరో రెండు టెస్టులకు కోహ్లీ దూరం!

 

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో మరో రెండు టెస్టులకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల్లో ఆడని విరాట్ మూడో, నాలుగో మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండబోడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

 

మార్చి 7 నుంచి ధర్మశాలలో జరిగే చివరి, ఐదో టెస్టులో పాల్గొనే అవకాశాలు కూడా తక్కువే అని చెబుతున్నాయి.

 

రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఈ నెల 15న మొదలవనుండగా... నాలుగో మ్యాచ్‌ రాంచీలో 23 నుంచి జరగనుంది. గాయం కారణంగా రెండో మ్యాచ్‌లో ఆడని కేఎల్‌ రాహుల్ రాజ్‌కోట్‌ టెస్టుకు జట్టులోకి తిరిగొచ్చే చాన్సుంది. తొడ కండరాల గాయం నుంచి రవీంద్ర జడేజా వేగంగా కోలుకుంటున్నప్పటికీ ఈ మ్యాచ్‌ టైమ్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవచ్చని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. రెండో టెస్టుకు రెస్ట్ తీసుకున్న సిరాజ్ తిరిగి జట్టులోకి రానున్నాడు.

 

మరో రెండు టెస్టులకు కోహ్లీ దూరం! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *